Saturday, May 4, 2024

ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాన్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్‌లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్‌లోని నల్లా ప్రాంతంలో సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు ప్రయత్నించారు. దీంతో సైన్యం అప్రమత్తమై వారిపై కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు కూడా కాల్పులకు పాల్పడడంతో ఓ సైనికుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారు. వారి కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News