- Advertisement -
ముంబయి: బాలీవుడ్ బాద్షా అయిన షారూఖ్ ఖాన్ కుమారుడు డ్రగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. అయితే జైలుకు వెళ్లిందగ్గరి నుంచి భోజనం సరిగా చేయడంలేదని తెలిసింది. జైలు క్యాంటిన్లో కొనుకున్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. జైలు సిబ్బంది భోజనం చేయమని అడిగినా ఒప్పుకోవడంలేదట. ఆకలి వేయడంలేదని చెప్పి భోజనం చేయడంలేదట. ఇంటి తెచ్చిన వాటర్ బాటిల్స్నే పొదుపుగా వాడుకుంటున్నాడట. బాత్ రూమ్ అపరిశుభ్రంగా ఉండటంతో నాలుగు రోజులుగా స్నానం కూడా చేయలేదట. అతడి ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారట. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ఇప్పటి వరకు మూడుసార్లు తిరస్కరణకు గురయింది. బుధవారం మరోమారు విచారణ జరగనుంది.
- Advertisement -