- Advertisement -
టోక్యో: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ ఒలింపిక్స్ క్రీడా గ్రామం (స్పోర్ట్ విలేజ్)లో అడుగుపెట్టేందుకు విముఖంగా ఉంది. అథ్లెట్ల కోసమే నిర్మించిన ఈ విలేజ్లో ఇటీవల వరుసగా కరోనా కేసులు బయటపడటంతో ఆస్ట్రేలియన్ స్టార్ బార్టీ మరో చోట బస చేయనుందని ఆసీస్ చెఫ్ డి మిషన్ ఇయాన్ చెస్టర్మన్ తెలిపారు. ఇటీవలే వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన ఆమె అదే ఉత్సాహంతో ఒలింపిక్స్ స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా పటిష్టమైన బుడగలో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెస్టర్మన్ పేర్కొన్నారు. అయితే కొన్ని దేశాలకు చెందిన అథ్లెట్లకు దూరంగా ఉండాలని తమ అథ్లెట్లకు ఎలాంటి సూచనలు చేయలేదని ఆయన చెప్పారు.
- Advertisement -