Saturday, May 11, 2024

అర్థరాత్రి పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి..

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి బంధువు రితేశ్‌రెడ్డిపై ఫిర్యాదు
వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు: పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలోని ప్రిసం పబ్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బుధవారం అర్థరాత్రి తనపై జరిగిన దాడిపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఎంఎలఎ రోహిత్‌రెడ్డి సమీప బంధువులు కొంతమంది వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో ఉన్న మహిళల పట్ల కూడా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పబ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని రాహుల్ ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పబ్‌లోని వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సిఐ శ్రీనివాసులు తెలిపారు. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 324, 34 రెడ్‌విత్ కేసు రిజిస్టర్ చేశామని సిఐ వివరించారు. రాహుల్‌పై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, పబ్‌లో దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సిఐ మీడియాకు తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐ ఆర్‌నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువు రితేశ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.
పబ్‌లో ఏం జరిగింది?:
రాహుల్‌సిప్లిగంజ్‌తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్‌పబ్‌కు వెళ్లాడు. రాహుల్ ఇద్దరు స్నేహితురాళ్ల పట్ల రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. అభ్యంతరం తెలిపినరాహుల్‌ను పక్కకు తోసేశారు. ఎందుకు కామెంట్ చేశారని ప్రశ్నించిన రాహుల్‌పై రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారని సిప్లిగంజ్ చెబుతున్నారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్‌ముఖానికి గాయమైంది.
పోలీసులపై నమ్మకముంది:
తనపై దాడి చేసిన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రాహుల్‌సిప్లిగంజ్‌అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. రితేశ్‌రెడ్డి గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, పబ్‌లోని వీడియో ఫుటేజీని సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

Attack on Bigg Boss Winner Rahul in Pub

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News