Saturday, April 27, 2024

ఎంజిఎం ఆస్పత్రిలో వైద్యులపై దాడి….

- Advertisement -
- Advertisement -


వరంగల్: ఎంజిఎం ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యురాలిపై కొందరు యువకులు దాడి చేసిన సంఘటన వరంగల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హుజురాబాద్‌కు చెందిన సాయి కృష్ణ(35) అనే వ్యక్తి చేతిలోకి సూది దిగబడింది. అతడిని ఎంజిఎం ఆస్పత్రికి స్నేహితులు తీసుకొచ్చారు. స్కానింగ్ చేసి సూది ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. బుధవారం ఆపరేషన్ చేస్తామని అప్పటి వరకు మందులు వాడాలని వాళ్లకు వైద్యులు సూచించారు. ఇప్పుడే అతడికి ఆపరేషన్ చేయాలని యువకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యులపై ఆ యువకులు దాడికి పాల్పడ్డారు. ఆరోగ్య సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని దాడి చేసిన యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై తరుచు దాడులు జరుగుతున్నాయని జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఎంజిఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సెలవుల్లో ఉండడంతో కోవిడ్ డైట్ ఇన్‌ఛార్జి డాక్టర్ మోహన్ రావు ఆందోళనకు దిగిన జూనియర్ వైద్యులతో సంప్రదింపులు జరిపి ఆందోళన విరమించేలా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News