Monday, May 6, 2024

మందు కోసం కూతురి అమ్మకానికి యత్నం

- Advertisement -
- Advertisement -

Attempt to sell Daughter for Alcohol

 

విజయవాడ : మద్యానికి బానిసైన ఓ తండ్రి మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన కూతురునే అమ్మకానికి పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్ నివాసి పెద్దపల్లి సతీష్ తన భార్య మీనా, ఇద్దరు కుమార్తెలతో కలిసి రెండు నెలల క్రితం బ్రతుకుదెరువు కోసం మహారాష్ట్ర నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో పని ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తి మోసం చేశాడు. అప్పటి నుంచి కూలి పనులు చేేసుకుంటూ వారు సంచార జీవితం గడిపారు. మంగళవారం అక్కడి నుంచి విజయవాడ బస్టాండుకు వచ్చారు. మద్యం మత్తుకు బానిసైన సతీష్ తన చిన్న కూతురును భార్య వద్ద వదిలి పెట్టి పెద్ద కుమార్తెను తీసుకొని బార్ వద్దకు వచ్చాడు. అక్కడ మద్యం తాగాడు. మరికొంత మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో మత్తులో ఉన్న అతడు చిన్నారిని పోషించలేనని చెప్పి రూ. 5వేలకు విక్రయిస్తానని అక్కడున్న వారిని అడిగాడు. పరిస్థితిని గమనించిన కొందరు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ ఐ శంకర రావు, సిబ్బందిని పంపి సతీష్ తో పాటు భార్యను పిలిపించి చైల్డ్ లైన్ నిర్వాహకులు రమేష్ తో వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News