Saturday, April 27, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆసీస్ 72 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఖవాజా హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.  ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్ హెడ్ (32), మర్నాస్ లబుషింగే(03), స్టివెన్ స్మీత్(38), పీటర్ హండ్స్‌కోంబ్(17) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(73), కామెరూన్ గ్రీన్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News