Tuesday, April 30, 2024

పదోతరగతి విద్యార్థిని గొంతుకోసిన ఆటో డ్రైవర్

- Advertisement -
- Advertisement -

Knife-Attack

అమరావతి: ఓ ఆటో డ్రైవర్ పదోతరగతి విద్యార్థిని గొంతుకోసిన దారుణ సంఘటన అనంతపురం పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ ఆటో డ్రైవర్ విద్యార్థిని వెంట పడుతున్నాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తక్షణమే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Auto Driver Knife Attack on Tenth Student at AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News