అమరావతి: ఏలూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిని ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతిదారుణంగా హత్య చేసింది. పట్టణంలోని గుడిపూడి నాగరాజు (38), భూలక్ష్మి భార్యభర్తలు. వీరికి విహహం జరిగి ఏడు సంవత్సరాలు అవుతోంది. నాగరాజు తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబంతో కలిసి పెదపాడు మండలంలోని వట్లూరులో నివాసముంటున్నాడు. అయితే స్థానికంగా ఉండే తోకల సురేష్, నాగరాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతని భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
అతని మాయలో పడిని భూలక్ష్మి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీనికి లవర్ తో కలిసి పథకం వేసింది. మే 6వ తేదీన ప్రియుడు సురేష్ తో కలిసి రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్తను రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. తర్వాత హత్యను ఉరిగా మార్చేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పారిపోయారు. ఉదయం నాగరాజు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.