Thursday, May 16, 2024

చత్తీస్‌గఢ్‌లో ఆటో, ఎస్‌యువి ఢీ: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Auto, SUV collision in Chhattisgarh: 9 killed

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో ఓ ఆటోరిక్షా, ఎస్‌యువి వాహనం ఢీకొన్న ఘటనలో 9మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన కొండగాం జిల్లా బోర్గాం ప్రాంతంలో జరిగింది. ఓ కుటుంబానికి చెందినవారు తమ బంధువు అంత్యక్రియలకు హాజరై ఆటోలో తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతి చెందినవారంతా ఆటోలోని వారు కాగా, గాయపడినవారు రెండు వాహనాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. గాయపడిన 9మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News