బ్యాట్మింటన్ అకాడమి అనుమతి కోసం వినతి
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో మాజీ బ్యాట్మంటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా భేటీ అయ్యారు. ఈ భేటీలో జ్వాలా గుత్తా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సికి క్రీడాశాఖ అనుమతి కోసం మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని మంత్రి కార్యలయంలో జ్వాలా తనప్రతిపాదనలను మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మర్పించారు. ఈ సందర్భంగా జ్వాలా మాట్లాడుతూ.. జ్వాలా గుత్తా అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాట్మంటన్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతిసంవత్సరం బ్యాట్మింటన్లో సిఎం కెసిఆర్ కప్పు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణక్రీడా ప్రాధికార సంస్థ తరుపున అనుమతులు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్కు విజ్ఞప్తి చేశారు. జ్వాలా ఇచ్చిన ప్రతిపాదనలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించనున్నట్లు తెలిపారు.