Thursday, May 16, 2024

4న రాష్ట్రానికి బండి సంజయ్ రాక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 4వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత బండి సంజయ్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News