Saturday, May 11, 2024

24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర..

- Advertisement -
- Advertisement -

పాతబస్తీ నుంచే ప్రారంభం…

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో 250 రోజులకు పైగా కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. బర్కత్‌పురాలోని బిజెపి నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండ సంజయ్, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశ వివరాలను ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. పాదయాత్ర నిర్వహణ కోసం 30 విభాగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న బండి సంజయ్ ఆధ్వర్యంలో పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

పాదయాత్ర నిర్వహణ కోసం ఇంఛార్జిగా గంగిడి మనోహర్‌రెడ్డిని, సహ ఇంఛార్జీలుగా తూళ్ల వీరేందర్‌గౌడ్, లంకల దీపక్ రెడ్డి, శంకర్‌ను నియమించినట్లు వెల్లడించారు. 2023లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు, సలహాలు తీసుకుఒని 2023 మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని తూళ్ల వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. యువత, మహిళలు, వృద్ధులు, రైతులకు పాదయాత్ర ద్వారా ధైర్యం ఇస్తామని వీరేందర్‌గౌడ్ తెలిపారు. మొదటగా ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలనుకున్నారు. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమవేశాలు ఉండటం, కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న దృష్టా పాదయాత్ర వాయిదా వేశారు. పాదయాత్ర ప్రారంభం నాడు కీలక జాతీయ నేత లేదా ముఖ్యమైన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News