Saturday, May 4, 2024

బండి సంజయ్ కుమార్ పర్యటన వివరాలు

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay padayatra

హైదరాబాద్: భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ వద్ద నుండి ప్రారంభమై శనివారం హుస్నాబాద్ లో ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ముగింపు విజయవంతంగా ముగిసింది. శనివారం సాయంత్రం ఐదు గంటలకు హుస్నాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఆదివారం ఉదయం 8 గంటలకు అమ్మ వారికి భాగ్యలక్ష్మి దేవాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హుజురాబాద్ కు చేరుకొని ఎన్నికల ప్రచారంను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జమ్మికుంటలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకొని ఎల్బీనగర్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ సెంటర్లో ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొని నిర్విరామంగా పని చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సోమవారం ఉదయం పదిగంటలకు పాదయాత్ర అనంతరం మొట్టమొదటిసారి బిజెపి రాష్ట్ర కార్యాలయం విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News