- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని పవన్కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఎపిలో బిజెపితో కలిసి పనిచేస్తున్న జనసేన.. తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. కాగా, ఈ భేటీ మర్యాదపూర్వకమేనని బిజెపి వర్గాలు అంటుండటం కొసమెరుపు.
సిఎం కెసిఆర్కు బండి సంజయ్ లేఖ
కోవిడ్ వ్యాధిని ఎదుర్కోవటానికి ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ఎలా ఖర్చు పెట్టారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్కు సోమవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు క్రమం తప్పకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోందన్నారు.
- Advertisement -