- Advertisement -
ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మద్య జరుగుతోన్న మ్యాచ్ లో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి దూకుడుగా ఆడుతుంది. బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మరో ఎండ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. పడిక్కల్ దంచికొట్టడంతో పవర్ప్లే ఆఖరికి 59 పరుగులు రాబట్టింది. దేవదత్ 27 బంతుల్లోనే అర్ధశతకంపూర్తి చేసకున్నాడు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు రాజస్థాన్ బౌలర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. కోహ్లి 22, పడిక్కల్ 59 పరుగులతో ఆడుతున్నారు.
- Advertisement -