Friday, April 26, 2024

రెండు రోజులపాటు బ్యాంకులు బంద్..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: తమ వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 20% పెంచాలని ప్ర‌ధాన కార్మి‌క క‌మిష‌నర్‌తో తాజాగా యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు జ‌రిపిన చ‌ర్య‌లు విఫ‌ల‌మ‌య్యా‌యి. దీంతో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో(శుక్రవారం, శనివారం) దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఉద్యో‌గ సంఘాలు ప్రకటించాయి. తమ సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు హెచ్చరించారు.

Bank Employees go on 2 days strike for hike Salaries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News