Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ విద్యార్థులు, పాఠశాల ఉపా ధ్యాయులతో కలిసి ఓయూ గిరిజన రాష్ట్ర నేత డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ మాట్లాడుతూ అడవులను, ప్రకృతిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో ఎంపి సంతోష్ తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారం చేయడం గొప్ప విషయ మన్నారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే గొప్ప కార్యక్రమన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రపంచం అంతటా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీసాయి విజ్ఞాన భారతి హై స్కూల్ కరస్పాండెంట్ డా.శశిధర్ రెడ్డి , డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డి, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News