Sunday, May 5, 2024

బాపట్లలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ దాడి… మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేసి గుంటూరులోని జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా విద్యార్థి అమర్నాథ్‌పై దాడి జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News