- Advertisement -
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ అస్వస్థతతో దీర్ఘకాలంగా బాధపడుతూ గురువారం కన్నుమూశారు. ఆయన రాష్ట్ర పంచాయత్ మంత్రిగా ఉన్నారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన మరణ వార్తను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె ఎస్ఎస్కెఎం ఆసుపత్రికి గురువారం సాయంత్రం వెళ్లి చూసిన తర్వాత ఆయన కన్పుమూశారని తెలిపారు. “ఆయన ఇక లేరన్న విషయాన్ని నేను కూడా జీర్జించుకోలేకుండా ఉన్నాను. ఆయన ఎంతో అంకితభావమున్న పార్టీ నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని నష్టం” అని మమతా బెనర్జీ తెలిపారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జరగడానికి ముందు ఆయన భౌతిక కాయాన్ని కోల్కతాలోని రబీంద్ర సదన్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. సుబ్రతా ముఖర్జీని గత వారమే హాస్పిటల్లోని ఐసియూకి తరలించారని వైద్య వర్గాలు తెలిపాయి.
- Advertisement -