Friday, May 3, 2024

దసరా కానుకగా ’భగవంత్ కేసరి’..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’భగవంత్ కేసరి’ దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుండగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భగవంత కేసరి ప్రయాణం ఒక క్లిప్‌లో చూపించారు. పూజా కార్యక్రమం నుండి, నిర్మాణ పనులకు సంబంధించిన కీలకమైన వివరాలను వీడియోలో చూపించారు. సినిమా టీమ్ 8 నెలల పాటు తీవ్రంగా శ్రమించారు . 24 అద్భుతమైన ప్రదేశాలలో, 12 మాసివ్ సెట్లలో షూటింగ్ జరిగింది.

బాలకృష్ణ కొన్ని పవర్ ప్యాక్డ్ డైలాగ్‌లు చెబుతున్నట్లు కూడా వీడియోలో ఉంది. కలిసి మాట్లాడతా అన్నా కదా, అంతలోనే మందిని పంపాలా… గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే… అంటూ గూండాలను హెచ్చరించారు. బాలకృష్ణ చెప్పిన చివరి డైలాగ్ బ్రో… ఐ డోంట్ కేర్… మొండి స్వభావాన్ని తెలియజేస్తుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News