Saturday, April 27, 2024

రాహుల్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాఃదీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.ఈ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల జులశిక్షపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.‘ఈ కేసులో గరిష్ఘ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి కారణాలను చూపలేదు. పేజీల కొద్దీ తీర్పు వెలువరించిన హైకోర్టు సైతం కారణాలను పేర్కొనలేదు.ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపి వేయాలి. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావనే విషయంలో సందేహమే లేదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు’ అని ధర్మాసనం వాఖ్యానించింది. ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు ఆయన అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధరాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ .. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ అసలు ఇంటి పేరు మోడీ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ల్లారు. రాహుల్ గాంధీ నేరస్థుడు కాడని, బిజెపి కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇది చివరి అవకాశమని తెలిపారు.గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్న వ్యక్తుల్లో ఒక్కరు కూడా ఆయనపై దావా వేయలేదన్నారు. కేసు వేసింది కేవలం బిజెపి నేతలేనని పేర్కొన్నారు. కాగా పరువునష్టం కేసు తీవ్రమైనది కాదని, బెయిలు ఇచ్చే కేసేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రాహుల్‌ను ఎన్నుకున్న ప్రజలతో పాటుగా ఆయన రాజకీయ జీవితంపైనా దీని ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.కాగా, కర్నాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకుంటుంది’ అని వాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఫలితంగా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభ లో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపిపదవిని కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుతో సోమవారంనుంచి రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. స్టే వెంటనే అమలవుతుందని, రాహుల్ అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ తొలగించాల్సి ఉంటుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News