Monday, April 29, 2024

బెంగాల్‌లో పట్టాలు తప్పిన బికనీర్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బికనీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. జల్ పాయ్ గురి ప్రాంతం మోయిన్ గురిలో నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు,  పోలీసులు, రైల్వే సిబ్బంది, స్థానిక ప్రభుత్వ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు పాట్నా నుంచి గౌహతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News