Saturday, May 4, 2024

బైక్, మొబైల్ ఫోన్ల దొంగలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

Bike and mobile phone robbers

 

హైదరాబాద్ : బైక్‌లు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమోరా, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని జేబాబాగ్ ఆసిఫ్‌నగర్‌కు చెందిన షేక్ ఉస్మాన్ అలియాస్ సైఫ్, ఎండి సోహైల్ ఇద్దరు కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో బైక్‌లు, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. ఉస్మాన్ ఇంటర్ వరకు చదువుకుని నగరంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బైక్‌లు, మొబైల్ ఫోన్లు చోరీ చేయడంతో గతంతో జూబ్లీహిల్స్, అబిడ్స్, ముషీరాబాద్ పోలీసులు 24సార్లు అరెస్టు చేశారు.

జైలు నుంచి విడుదలైన నిందితుడు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తున్నారు. నిందితులు లంగర్‌హౌస్‌లో రెండు, గోల్కొండ పిఎస్‌లో మూడు, రాజేంద్రనగర్ పిఎస్‌లో ఒక కేసు చొప్పున నమోదైంది. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ పర్యవేక్షణలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సైలు మల్లికార్జున్, రంజిత్‌కుమార్, ముజఫర్‌అలీ అరెస్టు చేశారు.

Bike and mobile phone robbers arrested
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News