- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘వ్యవసాయ వ్యతిరేక’ బిల్లులను తిరస్కరిస్తూ ఆర్టికల్ 254(2) కింద బిల్లులను పాస్ చేసే మార్గాలను అన్వేషించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. దీనివల్ల రైతులకు జరిగిన తీరని అన్యాయాన్ని నివారించినట్టు అవుతుందని ఆమె సూచించారు. ఈ ఆర్టికల్ కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని, ఏ రాష్ట్రమైనా ఈ విధంగా ప్రవేశ పెట్టే బిల్లు రాష్ట్రపతి దగ్గరకు ఆమోదానికి వస్తుందని, కాంగ్రెస్ నేత జెసి వేణుగోపాల్ ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వివరించారు. రాష్ట్రం తెచ్చిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే ఆ రాష్ట్రంలో కేంద్రం అమలు చేయనున్న బిల్లు అమలు కాదు.
- Advertisement -