Friday, May 3, 2024

‘గెల్లు గెలుపు బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత మాది’:హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో భారీగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”తెరాస గెలుపుతోనే హుజూరాబాద్ అభివృద్ధి ముడిపడి ఉంది. 17 ఏళ్లు ఈటల రాజేందర్ ను గెలిపించారు. ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. ప్రతీ మంత్రికి సీఎం కేసీఆర్ నాలుగు వేల ఇళ్లు మంజూరు చేస్తే… అందరు మంత్రులు ఇళ్లు నిర్మించారు. తెలంగాణలో ఒక్క ఇళ్లు నిర్మించని మంత్రి ఈటల మాత్రమే. తన సమస్యలను ఆయన ప్రజలపై రుద్దుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. ఈ రెండున్నరేళ్ల కోసం తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి. మీ స్వంత స్థలంలో కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. గెల్లు గెలుపు బాధ్యత మీరు తీసుకోండి… మీ అభివృద్ధి, సంక్షేమం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది” అని పేర్కొన్నారు.

BJP and Congress leaders joined in TRS in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News