Tuesday, April 30, 2024

గన్ తో సెల్ఫీ పరాచకం….. ప్రాణం తీసింది

- Advertisement -
- Advertisement -

BJP leaders sons dead in Bihar

 

పాట్నా: బిజెపి నేత కుమారుడు గన్ తో సెల్ఫీ తీసుకుంటుండగా పేలడంతో మృతి చెందిన సంఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిజెపి నేత ఓమ్ ప్రకాశ్ సింగ్ కు లైసెన్స్ గన్ ఉంది. ఓమ్ ప్రకాశ్ కుమారుడు హిమాన్షు కుమార్ గన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటుండగా ట్రిగ్గర్ పైకి వేలు పోవడంతో అకస్మాత్తుగా పేలిపోయింది. కంతలోకి బుల్లెట్ దూసుకపోవడంతో హిమాన్షు కిందపడిపోయాడు. ఓమ్ ప్రకాశ్ అనుచరుడు రామ్ ప్రవేష్ రాయ్ సెల్ఫీ తీసుకుంటుండగా గన్ పేలిన సంఘటన చూసి భయంతో పరుగులు తీశాడు. హిమాన్షు బతికే ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓం ప్రకాశ్ మృతి చెందాడు. బిజెపి నేత బంధువులు, అనుచరులు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News