Monday, April 29, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: 4వ రౌండ్ లోనూ బిజెపి ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

BJP Leads in 4th round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇందులోనూ బిజెపి ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 562 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ లో బిజెపికి 4,444 ఓట్లు, టిఆర్ఎస్ కు 3,882 ఓట్లు, కాంగ్రెస్ కు 107 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగు రౌండ్లతో కలిపి బిజెపికి 17,969 ఓట్లు, టిఆర్ఎస్ కు 16,144 ఓట్లు, కాంగ్రెస్ కు 680 ఓట్లు వచ్చాయి. నాలుగు రౌండ్ల తర్వాత బిజెపి 1,825 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా, ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

BJP Leads in 4th round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News