Monday, April 29, 2024

పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి జాతీయ నేతల పర్యటన

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి జాతీయ నేతలు ఈ నెల 4,5,6 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు బిజెపి గావ్ చలో-బస్తీ చలో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనుంది. ఈనెల 5 నుంచి మార్చి 5 వరకు అయోద్యకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి తెలిపింది. ఈనెల 18 నుంచి 24 వరకు మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 23న నారీశక్తి వందన్ పై మహిళలతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడనున్నారు.  ఈ నెల 17న పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు బిజెపి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News