Saturday, April 27, 2024

టిఆర్ఎస్ కు మెజార్టీ ఉంది: తలసాని

- Advertisement -
- Advertisement -

BJP Political drama with Religion wise

హైదరాబాద్: సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టిఆర్ఎస్ పై బిజెపి నేతలు చేస్తున్న కామెంట్లకు తలసాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో టిఆర్ ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు మాని రాష్ట్రాభివృద్ధికి బిజెపి నేతలు ప్రయత్నించాలని చురకలంటించారు. తెలంగాణలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. మతం పేరుతో బిజెపి నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో బిజెపి ఏం చేస్తుందో ప్రజలకు తెలుసని గట్టగా కౌంటర్ ఇచ్చారు. బిజెపి నేతలు బాధ్యతగా ఉండాలని, బాధ్యతగా మాట్లాడాలని తలసాని సూచించారు. తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ గా టిఆర్ఎస్ కార్పొరేటర్లను ఎన్నుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News