Sunday, May 5, 2024

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four Members dead in Car collided truck

 

సోలాపూర్‌ : మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగోలా-పంధర్‌పూర్‌ మార్గంలో కాసేగావ్‌ గ్రామ శివారులో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారితో సహా నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కొల్హాపూర్‌ జిల్లాలోని చంద్గడ్‌ తహసీల్‌కు చెందిన వారిగా గుర్తించారు.  పంధర్పూర్‌లో దైవ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ కిరణ్‌ అవ్చర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, బాలిక ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News