- Advertisement -
హైదరాబాద్: శేరిలింగంపల్లి డివిజన్లో బిజెపి కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ కుంచం శీను అనే బిజెపి కార్యక్త దుర్మరణం చెందాడు. శ్రీను బైక్ పైనుంచి పడి మృతి చెందాడని బిజెపి నాయకులు చెబుతున్నారు. ప్రచారం కోసం తీసుకెళ్లి తన భర్తను బిజెపి నాయకులు చంపేశారని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. పరిహారం ఇవ్వాల్సి వస్తుందని బిజెపి నాయకులు తప్పించుకుంటున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -