Monday, April 29, 2024

ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం

- Advertisement -
- Advertisement -

జనగామటౌన్ : టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వీసీ.సజ్జనార్, వీసీ అండ్ ఎండీ ఆదేశాల మేరకు మంగళవారం జనగామ ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుగుణాకర్‌రాజు, జనగామ డిపో మేనేజర్ వి.జ్యోత్స ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రామనర్సయ్య, డాక్టర్ మల్లేష్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు, హాస్పిటల్ టెక్నిషియన్లు టి.రాజేశ్వరీ, కె.వెంకటస్వామి, కె.రజిని, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, డిపో సూపర్‌వైజర్లు కె.రవిందర్, ఏఎంఎఫ్ వై.యాదమణిరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం.సమ్మయ్య, టీఐ-2 ఆర్.యాదగిరి, హెడ్ కానిస్టేబుల్, టీబీఎస్.రెడ్డి, సీఆర్‌సీ, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News