Sunday, May 12, 2024

అన్నదాతల ఆత్మబంధువు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కా ర్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రా వుకు మరోసారి కృతజ్ఞతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గు రువారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన మంత్రులు, శాసన సభ్యులు సిఎం కెసిఆర్ ను వారి చాంబర్‌లో కలిసి, రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, తాజాగా తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయానికి కృతజ్ఞాతాభివందనాలు తెలిపారు. దీంతో అసెంబ్లీలోని సిఎం చాంబర్‌లో గురువారం నాడు సందడి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రజాప్రతినిధులు సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛాలు  అందించి జిల్లాల కలిసి ఫొటోలు దిగారు.

తమ రైతుల తరఫున ప్రజల పక్షాన సిఎం కి ధన్యవాదాలు తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధ్ది, సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో సిఎం కెసిఆర్‌కి కృతజ్ఞాతిభినందనలు వెల్లువెత్తాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసనసభా ప్రారంభానికి ముందే సిఎం రాకకోసం వేచి చూసి వారు రాగానే పూలబొకేను అందించారు. రైతు రుణమాఫీ చేసినందుకు వ్యవసాయ శాఖ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎలు మాట్లాడుతూ రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని సిఎం కు వివరించారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, రైతు బాంధవుడిగా సిఎం కెసిఆర్ మరోసారి నిలిచారని, రుణమాఫీ సంపూర్ణం చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదని వారు కొనియాడారు.

మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కెటిఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంఎల్‌ఎలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రి సబితా మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎంఎల్‌ఎలు, వీరితో పాటు పలువురు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News