Friday, April 26, 2024

వరంగల్ జిల్లాలో ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరవక ముందే ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లాలోని నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసి తృతీయ సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో రక్షిత కు సంబంధించిన పోటోలు ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్థాపం చెందిన రక్షిత వరంగల్ లోని బంధువుల ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్యాను కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రక్షిత తల్లిదండ్రులు సీనియర్ల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆవేధన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News