Saturday, April 27, 2024

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 30న అఖిలపక్ష సమావేశం

- Advertisement -
- Advertisement -

Budget session of parliament 2021

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 30న అఖిల పక్ష సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు సంబంధించిన అజెండాను చర్చిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం విలేకరులకు తెలిపారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా అన్ని పార్టీల సభా పక్ష నాయకులను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ప్రతి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు సభా సజావుగా సాగేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమవుతుండగా మరుసటి రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం విశేషం. జనవరి 29న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరుగుతాయి. మొదటి భౠగం ఫిబ్రవరి 15న ముగియనుండగా రెండవ భాగం మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News