Saturday, April 27, 2024

వరంగల్ లో కూలిన భవనం…

- Advertisement -
- Advertisement -

వరంగల్: చార్‌బౌళిలోని పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. భవనం కూల్చివేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ లో శిథిలావస్థకు చేరిన భవనాలు కూల్చివేయాలని అధికారులు ఇంటి యజమానులను కోరుతున్నారు. భవన శిథిలాల నుంచి సాగర్, సునీత మృతదేహాలను బయటకు తీసి అనంతరం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News