Friday, April 26, 2024

దొంగతనానికి వెళ్లి మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

burglar rapes woman

న్యూఢిల్లీ: 23 ఏళ్ల దొంగ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పురలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తన ఇంటి బాల్కానీలో ఉన్న సమయంలో నిందుతుడు ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి ఆమెను పట్టుకుని ఎటిఎం కార్డు ఇవ్వమని, పిన్ నంబర్ చెప్పమని బెదిరించాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపంతో బాధితురాలిని కొట్టి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మాస్క్ ధరించడంతో అతని ముఖం కనబడలేదని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు టీమ్‌లుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడు 23 ఏళ్ల సోనుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందే అతనిపై పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారంతోపాటు మరికొన్ని క్రిమినల్ కేసులపై విచారించేందుకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

burglar rapes woman in Delhi’s Jangpura

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News