Monday, April 29, 2024

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు పల్టీ

- Advertisement -
- Advertisement -

Car Accident on Durgam Cheruvu Cable Bridge

హైదరాబాద్: దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Car Accident on Durgam Cheruvu Cable Bridge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News