- Advertisement -
హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి గంగుల కమాలాకర్ పై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును శుక్రవారం నాడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. మంత్రి గంగుల తరుపున అడ్వకేట్ రాజేందర్ రావు వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో అధికారిక కార్యక్రమాలలో కొబ్బరికాయ కొట్టారని మంత్రి గంగులతో పాటు చల్లా హరిశంకర్, చంద్రశేఖర్, సూర్యశేఖర్, వరప్రసాద్, పెద్దిరమేష్ లపై ఎన్నికల కోడ్ ఉల్లంగన కింద కేసులు నమోదయ్యాయి. ఈ అభియోగాలను విచారించిన నాంపల్లి ఎంఎల్ఏ, ఎంపిల కోర్టు, ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించలేకపోవడంతో మంత్రి గంగులతో సహా మిగతా వారందరిపై కేసులను కొట్టివేసి నిర్దోషులుగా తీర్పు వెలివరించింది.
- Advertisement -