Tuesday, April 30, 2024

సినీ నటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

case filed against actress radha prasanthi

హైదరాబాద్: సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదైంది. తనపై సినీ నటి రాధా ప్రశాంతి దురుసుగా ప్రవర్తించారంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ”ఇక్కడి ఓ భవనంలో బిల్డింగ్ సెక్యూరిటీగా లక్ష్మి అనే మహిళ పని చేస్తోంది. బుధవారం రాత్రి పెద్ద శబ్దం వినిపించింది. దీంతో బయటకు వచ్చి చూశాను. ఆ సమయంలో లక్ష్మిని రాధా ప్రశాంతి కారు ఢీకొట్టింది. ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తి లక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని నా మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాను. దాన్ని గమనించిన ప్రశాంతి తీవ్ర ఆగ్రహంతో నాపై దురుసుగా ప్రవర్తించింది. సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టింది” అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

case filed against actress radha prasanthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News