Saturday, May 18, 2024

నితీశ్ సర్కార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట .. కులగణనకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బీహార్ ప్రభుత్వం కులగణనను మొదలు పెట్టింది. మొదటి దశ సర్వే జనవరి 721 తేదీల మద్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే 15తో ముగియాల్సి ఉండగా, మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపి వాటిని కొట్టేసింది. అయితే పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. రాష్ట్రం లోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక ఆర్థిక స్థితి గతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బీహార్‌లో కులగణన చేపట్టనున్నట్టు గత ఏడాది సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రం లోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News