- Advertisement -
హైదరాబాద్: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యలో కేంద్ర బృందాలు మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాపి తీవ్రత ప్రాంతాలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 26న(శుక్రవారం) కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రంతోపాటు గుజరాత్, మహారాష్ట్రలోనూ కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలతో కేంద్ర బృందాలు చర్చించనున్నాయి. కాగా, దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. ఇక, దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 14,915 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది.
Central team tour in Telangana over Coronavirus
- Advertisement -