- Advertisement -
మక్తల్: పట్టపగలు మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. బైకు పైన వచ్చిన దుండగులు పట్టణంలోని శబరి కాలనీలో భారతి అనే మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని చెప్పారు.
- Advertisement -