Monday, May 6, 2024

ఎసిబి కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. చంద్రబాబు జైలు అధికారుల ద్వారా ఎసిబి న్యాయమూర్తికి లేఖ పంపారు. ఈనెల 25న న్యాయమూర్తికి టిడిపి అధినేత లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.

చంద్రబాబు లేఖలోని అంశాలు…

“నాకు జెడ్ ప్లస్ భద్రత ఉంది. నేను జైలుకు రాగానే అనధికారికంగా నా ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ దృశ్యాలను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ తరహా వీడియో ఫుటేజీని విడుదల చేశారు. వామపక్ష తీవ్రవాదులు నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా పంపారు. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు” అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

జైలులో భద్రతపై…

రాజమండ్రి సెంట్రల్ జైలులో తన భద్రత గురించి కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఎస్ కోటకు చెందిన ఓ నిందితుడు జైలులో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తన కదలికల కోసం జైలుపై అనధికార డ్రోన్లు ఎగురవేస్తున్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులు ఈ డ్రోన్‌లను ఎగురవేశారని భావిస్తున్నానని వాపోయారు. డ్రోన్లు ఎగిరే విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

అక్టోబర్ 6వ తేదీన తన కుటుంబ సభ్యులు కలవడానికి వచ్చినప్పుడు సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్ద మరో డ్రోన్ ఎగురవేశారన్న చంద్రబాబు తన భద్రత మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడ్డారని ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో అధికారంలో ఉన్న వ్యక్తులు నాపై వివిధ సందర్భాల్లో దాడి చేశారు. జైలు ఆవరణలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీలపై గంజాయి ప్యాకెట్లు విసురుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News