Saturday, May 4, 2024

రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించిన చైనా

- Advertisement -
- Advertisement -

rajasingh

 

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ధూల్‌పేటలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్.. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన జ్యోతి ప్రజ్వలన కావించి చైనీస్ వైరస్ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్(పార్లమెంటు) లియూ బింగ్ ఈ మేరకు రాజాసింగ్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి నివే దించిన తొలి దేశం చైనా అని పేర్కొంటూ.. ఈ వైరస్ చైనానుంచి ఉద్భవించిందని కాదని స్పష్టపర్చారు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని రాజాసింగ్ చేసిన నినాదాలను ఖండించారు. మరోవైపు చైనా రాయబార కార్యాలయం ఖండనపై రాజాసింగ్ ప్రతిస్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు సైతం ఇది కరోనా వైరస్ కాదు. చైనా వైరస్ అని పేర్కొన్నారన్నారు. ఇది నిజం కాదా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.

China denies Rajasingh remarks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News