- Advertisement -
హైదరాబాద్ : భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను సిఎం కెసిఆర్కు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అందజేశారు. ప్రగతిభవన్లో రాష్ట్ర కెబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సిఎం కెసిఆర్తో సమావేశమై తలంబ్రాలను, ప్రసాదాలను అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్యాణ ప్రసాదం, తలంబ్రాలు పొందాలకునే భక్తులు స్మార్ట్ ఫోన్ నుంచి టి యాప్ పొలియో (T App Folio) యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తున్నామన్నారు. కరోనా వైరస్ కారణంగా భక్తులు లేకుండా రాములవారి కల్యాణం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టి యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ పూజలతో పాటు ప్రసాదాలను దేవాదాయ శాఖ పంపిణీ చేస్తోంది.
Lord Ramas talambralu given to cmkcr by indrakaran reddy
- Advertisement -