Saturday, April 27, 2024

సినిమా టికెట్ల ధరపై ఎపి ప్రభుత్వం పునరాలోచించాలి: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Chiranjeevi appeals to AP CM to hike movie ticket prices

హైదరాబాద్: సినిమా టికెట్ల ధరల విషయంలో ఎపి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. దేశమంతా ఒకటే జిఎస్టీ పన్నులు వసూలు చేస్తున్న తీరును ఉదహరించిన చిరంజీవి, టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు కల్పించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగానే ఏపిలోనూ టికెట్ ధరలను నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. థియేటర్ల మనుగడ కోసం, సినిమాపై ఆధారపడ్డ కుటుంబాల కోసం ఎపి ప్రభుత్వం ఆలోచించాలని చిరు సూచించాచరు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News