Friday, April 26, 2024

మెట్రోరైల్ ప్రాజెక్ట్‌పై సమీక్ష జరిపిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR review on Metro rail project

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై గురువారం బిఆర్‌ఆర్‌కె భవనంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మెట్రోరైలు నష్టాలతో పాటు మెట్రో పొడిగింపు తదితర సమస్యలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News