Friday, April 26, 2024

‘నాట్యం’కు ప్రజాశీస్సులు ఉంటాయి: చిరు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi praised the film 'Natyam'

 

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాను ప్రశంసించారు. చిరంజీవి మాట్లాడుతూ.. “నాట్యం సినిమా మంచి ఫీలింగ్‌ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు. కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు. ఇలాంటి చిత్రాలు అనగానే మనకు కె.విశ్వనాథ్ గుర్తుకు వస్తారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది. ఇండస్ట్రీని ‘శంకరాభరణం’ సినిమా ముందు ‘శంకరాభరణం’ తరువాత అని అంటుంటారు. అలాంటి శంకరాభరణం సినిమాను ఎంతగా ఆదరించారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను” అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News